Tuesday 3 July 2012

వేదవ్యాసుడు

ది. 03.07.2012 వ తేదీ 
"శంకరాభరణం" బ్లాగులో 
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి 
వ్రాసిన పద్యవ్యాఖ్య



వేదవ్యాసమునీంద్రసత్తమునకున్, విద్యాసముద్రుండుగా
వేదంబుల్ విభజించి చూపి క్రమతన్ విశ్వప్రజానీకముల్
మోదంబంద పురాణసంచయమిలన్ మున్నెవ్వడందించెనో
ఆ దివ్యాత్ముని కంజలింతు సతమున్ హర్షాతిరేకంబునన్.

సురుచిరశబ్దసంయుతము, సుందరభావగుణాన్వితంబు, స
త్వరపురుషార్థసిద్ధిదము, భాగ్యవివర్ధనకారకంబుగా
కురుచరితంబు కావ్యముగఁ గూరిచినట్టి మహామహుండికన్
సురసముడైన వ్యాసునకు శుద్ధమనస్కున కంజలించెదన్.

పంచమవేదమై నిలిచె భారతకావ్యము జ్ఞానసంపదన్
బెంచెడిదై కవీంద్రులకు విజ్ఞత గూర్చెడిదౌచు నన్నిటన్
మించినదై వెలింగినది మేటిగ దాని సృజించువాని నే
నంచితమైన భక్తి తనివారగ వ్యాసుని ప్రస్తుతించెదన్. 

No comments:

Post a Comment