Sunday 1 July 2012

రవీంద్రుడు

ది. 01.07.2012 వ తేదీ  
"శంకరాభరణం" బ్లాగులో  
"పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి 
వ్రాసిన పద్యవ్యాఖ్య
రవీంద్రుడు
శా.
చేతం బుల్లసిలంగ జేయు పదరాజింగూర్చి యందంబుగా
జాతీయంబగు గీతరాజమును దేశైశ్వర్య (దేశైక్యాను)  
                                                           సంధాయిగా
ఖ్యాతిం బెంచెడిదానిగాఁ బలికె నాహా! సత్కవీశుండు నే
జోతల్ సేతు రవీంద్రనాథునకు సుశ్లోకుండునౌ మౌనికిన్.
తే.గీ.
ఉన్నతంబైన భావంబు లెన్నొ చేర్చి
గీతములు గూర్చి యలరించు రీతి నాత
డంజలించుచు సత్కీర్తి నందుచుండి
విశ్వకవియౌచు నిలిచిన విజ్ఞవరుడు.
తే.గీ.
పుణ్యభూమిగ పదునాల్గు భువనములను
ఘనత నందిన భారతావనికి భక్తి
నీత డందించె శాంతినికేతనంబు
వినయమున జేతునిక రవీంద్రునకు నతులు.

No comments:

Post a Comment