Wednesday 2 May 2012

శ్రీ కందుకూరి వీరేశలింగము

"శ్రీ కం దు కూరి వీ రే శ లిం గ ము"
నామాక్షర పద్యమాలిక
("శంకరాభరణం" బ్లాగులో ది. 02.05.2012 తేదీ
 "పద్యరచన" శీర్షికన ఇవ్వబడిన వీరేశలింగం గారి చిత్రానికి వ్రాసిన 
పద్యవ్యాఖ్య.
ఛందము - కందము.

శ్రీకరుడై సంఘంబున
  మూకలుగా నిండియున్న మూఢాచారా
  లేకాగ్ర చిత్తధరుడయి
  పోకార్చిన ఘనుడు తాను పుణ్యాత్ము డికన్. 

కంటకతుల్యములై పలు
  తంటాలను తెచ్చుచుండి ధరణీతలమం
  దంటిన బాల్యవివాహా
  లింటింటికి చేయు కీడు నీతడు తెల్పెన్(మాన్పెన్.)

దురితంబుల నెల్లెడలం
  బరిహారము చేయుచుండి, పడతుల కిలలో
  సురుచిర జీవనమునకై
  నిరతము శ్రమియించినట్టి నిర్మలు డతడున్. 

కూరిమి తనువున నిండిన 
  ధీరుడు వీరేశలింగ ధీశాలి (యికన్) యహో
  కారణజన్ముం డాతడు
  వేరెవ్వరు సాటి లేరు విశ్వము నందున్. 

వీరను వారను భేదం
  బారయు నజ్ఞానిజనుల కనవరతంబున్
  కోరుచు నుద్బోధించెను
  మీరిట్టులు చేయ దగదు, మీరకుడనుచున్. 

రేలుంబవ లనునిత్యం
  బాలోచన చేసి స్త్రీల కద్భుతరీతిన్
  మేలొనరించెడి విద్యా
  శాలలు స్థాపింప జేయు సజ్జను డతడున్. 

తవిధముల యత్నించిన
  గతిలేని వితంతులైన కర్మఠుల కిలన్
  హితకారిణి యను సంస్థను
  వెతలం ద్రుంచంగ నిల్పు విజ్ఞుం డతడే. 

లింగాకారుని దలచిన
  కంగారై తొలగిపోవు కల్మష మట్లున్
  వంగడములు సుఖదములౌ
  నంగీకృతులౌచు వీరి యనుసరణమునన్. 

ద్యంబున తిక్కనయై
  పద్యంబున ప్రోడ యగుచు బహుకావ్యంబుల్
  హృద్యంబుగ రచియించిన
  విద్యావంతునకు జేతు వినయాంజలులన్. 

మునులను మించిన వాడత
  డనవరతము సంఘసేవ కంకిత మగుచున్
  తనువుకు ధన్యత గూర్చిన
  ఘనచరితుడు కందుకూరి కవిసత్తముడున్. 
హ.వేం.స.నా.మూర్తి.


No comments:

Post a Comment