Tuesday 9 October 2012

ఎర్రన

09.10.2012 వ తేదీ శంకరాభరణం బ్లాగులో
 పద్యరచన శీర్షికన ఇవ్వబడిన చిత్రానికి వ్రాసిన 
పద్యవ్యాఖ్య
 
ఎర్రన 
సీ.    రమ్యంపు భారతారణ్యపర్వమునందు
                      శేష(శిష్ట)భాగము పూర్తిచేసె నతడు,
        కోదండపాణియౌ కోసలాధీశుని
                       చరిత మాతడు పల్కె శ్రద్ధతోడ,
        హరివంశకావ్యంబు నతిసమర్థతతోడ
                       విరచించి యున్నట్టి విజ్ఞు డతడు,
        నరసింహలీలను నైష్ఠికుడై నిల్చి
                       వచియించె నలనాడు వైభవముగ

తే.గీ. ఆంధ్రసాహిత్య జగతిలో ననుపమమగు
        ఖ్యాతి గడియించి యున్నట్టి ఘనుడతండు
        ఎఱ్ఱనార్యుడు, కవిపరమేశ్వరుండు
        సములు లేనట్టి సాహితీ స్రష్ట యతడు.


కం.  నన్నయ్యకు తిక్కన్నకు
        నెన్నంగా మిత్రుడట్టు లింపుగ నాడున్
        మిన్నగ భారతశేషము
        నన్నింట సమర్థుడౌచు నాంధ్రము చేసెన్.


ఆ.వె. శంభుదాసుడంచు సాహితీలోకాన
         ఖ్యాతినందియుండి చేతమలర
         నధికభక్తి శార్ఙి యవతారముల నెన్నొ
         పల్కినట్టి ఘనుని ప్రస్తుతింతు.
 

No comments:

Post a Comment