Saturday 29 December 2012

తెలుగు వైభవం


పద్య రచన - 205 

(శనివారం 29 డిసెంబర్ 2012)

 

 
తెలుగు వైభవం
ఆంధ్రభోజుడాత డలనాడు బహుభాష
లరసి వాటి రసము లనుభవించి
తెలుగుభాషలోని తియ్యందనాలను
మెచ్చి పల్కె నిట్లు మేలటంచు.


సందియంబు లేదు సర్వాంగసుందరం
బైన భాష గాదె యాంధ్రభాష
నిత్యసత్యమియ్య దత్యంత మధురంబు
దేశభాషలందు తెలుగు లెస్స.

 
పలికినట్లుగానె భక్తిభావము బూని
కవులనాదరించి ఘనతగూర్చి
సాధుకార్యమంచు సాహిత్యసేవను
చేసి యుండి నట్టి శ్రేష్ఠుడతడు.


కృష్ణరాయవిభుని కృపచేత నలనాడు
తెలుగుతల్లి మిగుల వెలుగులీనె
ఘనతరంబులైన కావ్యంబు లెన్నియో
భాగ్యవశముచేత భవమునందె.


వర్తమానమందు పాలకాగ్రణులందు
మాతృభాషపైన మమత లేదు
సంఘటించ వలెను సాహితీ బంధువుల్
తెలుగు వైభవంబు నిలుపు కొరకు. 

No comments:

Post a Comment